బుడాపెస్ట్: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన టేబుల్ టెన్నిస్ (టీటీ)క్రీడాకారిణి మనికా బాత్రా.. తాజాగా మెరుగైన ప్రదర్శనతో రాణించింది. బుడాపెస్ట్లో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మనిక, సాతియాన్ జోడీ 3-1 (11-9, 9-11, 12-10, 11-6)తేడాతో హంగేరీ ద్వయం మదర్సాజ్, నాందోర్ ఎక్సేకిపై విజయంతో టైటిల్ దక్కించుకుంది. తొలి గేమ్ గెలిచిన సాతియాన్, మనిక జోడీ రెండో గేమ్ను చేజార్చుకుంది. తిరిగి పుంజుకుని వరుస గేమ్లు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది.