సిటీబ్యూరో, జూలై 10 ( నమస్తే తెలంగాణ ) : మొన్నటి వరకు కరోనా పరిస్థితులు.. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఇంటికే పరిమితమైన ఆటోలు, క్యాబ్లు ఇప్పుడు నగర రోడ్లపై రయ్య్మ్రంటున్నాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో వాటిల్లో ప్రయాణించేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. బుకింగ్లు జోరందుకోవడంతో డ్రైవర్ల ఉపాధి గాడిన పడుతున్నది. అటు ఐటీ, ఇతర కార్యకలాపాలు సైతం జోరుగా సాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రయాణాలు ఊపందుకున్నాయి. క్యాబ్ సర్వీస్ వినియోగం పెరిగింది. గ్రేటర్లో సుమారు 50 వేల క్యాబ్లు సర్వీస్ అందిస్తున్నాయి. మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు భరోసా దొరికినట్టుగా భావిస్తున్నారు. ఉబర్, ఓలా వంటి సంస్థలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి.
కరోనా పరిస్థితులతో గిరాకీ లేక ఆటోలు ఇంటికే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రయాణికులు భయం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం. వాహన ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న మాకు ప్రస్తుత పరిస్థితులు ఊరట కలిగించాయి. ప్రతీ రోజు 20కి పైగా బుకింగ్స్ వస్తున్నాయి. సాధారణ గిరాకీ కూడా దొరుకుతున్నది. కరోనా వల్ల నష్టపోయిన వారిలో అధికంగా డ్రైవర్లే. వెంకటేశ్, డ్రైవర్
కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్టు ప్రయాణికులకు నమ్మకం కలిగితేనే క్యాబ్స్, ఆటోలు ఎక్కుతున్నారు. అందుకే మేం ప్రయాణికులు, డ్రైవర్కు మధ్య కవర్ ఏర్పాటు చేస్తున్నాం. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. అయితే చాలా మంది ఆటోను ప్రత్యేకంగా బుక్ చేసుకుంటున్నారు. డబ్బులు ఎక్కువైనా ఎంగేజ్ చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్ దృష్యా ఇతర ప్యాసింజర్లు ఎక్కితే ఇబ్బంది అవుతుందని ఇలా చేస్తున్నారు. మొన్నటి వరకు ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డ మాకు ప్రస్తుత పరిస్థితులు ఉపశమనం కలిగిస్తున్నాయి.
వాహన ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డాం. చాలా వరకు వాహనాలను ఈఎంఐలు చెల్లించలేదని ఫైనాన్స్ కంపెనీలు లాక్కెల్లాయి. అంతా గందరగోళ పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ బతుకుపై ఆశ పుట్టింది. వాహనాలు రోడ్లెక్కుతున్నాయి. గిరాకీ పుంజుకుంటున్నది.