ముంబైలో చాలా రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపే నమోదయ్యాయి.
గడచిన 24 గంటల్లో కొత్తగా 929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.మార్చి 2 తర్వాత అతి తక్కువ కేసులు నమోదడం ఇదే తొలిసారి. 11 వారాల తర్వాత కేసులు వెయ్యి కన్నా తక్కువకు పడిపోయాయి. మార్చి 2న ముంబైలో 849 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 20,740 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 424 మంది మృతిచెందారు.