ఇబ్రహీంపట్నం, మార్చి 24 : ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామానికి చెందిన షేక్ నవాజ్కు రూ.60వేలు, యాచారం మండలంలోని మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన పాశం మధుకర్రెడ్డి రూ.38వేలు, చింతపట్ల గ్రామానికి చెందిన తోట పోచయ్యకు రూ.32వేలు, కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదిమెట్ల వెంకటేశ్కు రూ.22వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు బూడిద నందారెడ్డి పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ఆమనగల్లు, మార్చి 24 : కల్వకుర్తి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ఆయన నివాసంలో అందజేశారు. తోటపల్లికి చెందిన అర్జునయ్యకు రూ.16వేలు, ఎంజీ తండాకు చెందిన దేవి రూ.16 వేలు, నగరగడ్డ తండాకు చెందిన లాలునాయక్కు రూ.24వేలు, జిల్లేలకు చెందిన చావ్లీకి రూ.21వేలు, దేవన్నకు రూ.26వేలు, జంగయ్యకు రూ.56వేలు మంజూరయ్యాయి. కాగా, సదరు చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్సీ అందజేశారు.