జోగులాంబ గద్వాల : జిల్లాలో నకిలీ విత్తనాలపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. మల్డాకల్, దరూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో మూడు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు 16 రోజులుగా నకిలీ విత్తనాల పై పోలీస్ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా ఈ రోజు మల్డకల్ మండలం మంగం పేట గ్రామలో రంగ స్వామి అనే సబ్ ఆర్గనైజర్ ఇంట్లో నకిలీ విత్తనాలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు..మల్డకల్ ఎస్సై శేఖర్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. సబ్ ఆర్గనైజర్ రంగస్వామి ఇంట్లో 250కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అలాగే దరూర్ మండలం గార్లపాడు గ్రామoలో సబ్ ఆర్గనైజర్ బేరం రవి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 50 కిలోల నకిలీ విత్తనాలు గుర్తించి మండల వ్యవసాయ శాఖ అధికారుల పిర్యాదు మేరకు అతడిపై పోలీసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
చోరీలకు పాల్పడిన దొంగపై పీడీ యాక్ట్
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి