మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 3 : పురపాలక సం ఘంలో ఆస్తిపన్ను బకాయిలతోపాటు, మున్సిపల్ దుకాణాల పెండింగ్ అద్దెను వెంటనే వసూలు చేయాలని కమిషనర్ ప్రదీప్కుమార్ ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఆస్తిపన్ను చెల్లింపునకు ఈనెల 15వరకు గడువును పెంచినట్లు తెలిపారు. మొండి బకాయిదారులు ఉంటే నోటీసులు జారీ చేయాలని సూచించారు. అలాగే మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిల వసూలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సమావేశంలో మేనేజర్ వెంకటేశ్వరావు, రమేశ్, ఆర్ఐలు హన్నాన్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
పనుల పూర్తిపై దృష్టి సారించాలి
పురపాలక సంఘంలో చేపట్టిన అభివృద్ధి పనుల పూర్తిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. శనివారం అయ్యప్పగుట్టలో వైకుంఠధామం, తెలంగాణ చౌరస్తా అభివృద్ధి పనులను ఎంఈ బెంజిమెన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్ పనులు ఎక్కడ ఉన్నా వెంటనే చేపట్టాలని తెలిపారు. జంక్షన్ అభివృద్ధి పనులతోపాటు రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన పైప్లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.