కొలంబో: తన బుల్లెట్ యార్కర్లతో దశాబ్దంనర పాటు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లను వణికించిన శ్రీలంక పేసర్ సెపరమాడు లసిత్ మలింగ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత ప్రమాదకర బౌలర్గా పేరుతెచ్చుకున్న 38 ఏండ్ల మలింగ మంగళవారం ట్విట్టర్ వేదికగా క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ‘ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నా. ఇన్నాళ్లు నా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భవిష్యత్తులో నా అనుభవాలను యువ ఆటగాళ్లతో పంచుకుంటా’ అని మలింగ ట్వీట్ చేశాడు. గతేడాది వెస్టిండీస్తో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మలింగ.. టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టాడు.