ముఖ్యమైన, తీవ్రమైన ఘటనల్లో.. నేరస్తులను పట్టుకునేందుకు, న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు నగర పోలీసులు వెనకాడడం లేదు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో..పట్టుబడిన నిందితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చినా రాకున్నా.. కొవిడ్ రక్షణ సూత్రాలను అనుసరిస్తూ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత దవాఖానకు తరలిస్తున్నారు.
ఇటీవల కాశ్మీర్లో కాల్పులకు పాల్పడి తప్పించుకుని మహబూబ్నగర్కు వచ్చి దాచుకున్న గ్యాంగ్స్టార్ను అరెస్టు చేసే క్రమంలో కూడా నిందితులకు కరోనా సోకింది. పోలీసులు ముందు వారిని పట్టుకుని కరోనా పరీక్షలు చేయించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కరోనా నిబంధనలు పాటిస్తూ.. కశ్మీర్ పోలీసులకు నిందితులను అప్పగించారు.