భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
సీపీఐ నుంచి 25వ వార్డు కౌన్సిలర్, 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిక
కృష్ణకాలనీ, ఏప్రిల్ 12 : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశ ప్రజలు ఆయన పాలనను కోరుకుంటున్నారని జయశంకర్ భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి సీపీఐ పార్టీకి రాజీనామా చేసి 200 మంది కార్యకర్తలు, ఏఐటీయూసీ నుంచి నలుగురు ఈపీ ఆపరేటర్లు సోమవారం ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేయబోతున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో ముందుందన్నారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూపాలపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రోడ్లు మొత్తం బుర దమయంతో ఉన్నప్పుడు గల్లీగల్లీకి సీసీరోడ్లు వేయించి రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి చేశానన్నారు.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజల గోస తాకుతుందన్నారు. దేశంలో లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను తన బంధవులకు ఇచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, భూపాలపల్లిని యోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసే సీపీఐ పార్టీని వీడి టీఆర్ఎస్లో తన అనుచరులతో కలి సి చేరినట్లు మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు ఎడ్ల మౌనిక, నూనె రాజు, పానుగంటి హారిక, కొక్కుల స్వరూప, నాగవెల్లి సరళ, మేకల రజిత, శిరుప అనిల్, మాడ కమల, బద్ది సమ్మయ్య, నాగుల శిరీష, చల్ల రేణుక, ముంజంపల్లి మురళీధర్, ముంజాల రవీందర్, పిల్లలమర్రి శారద, జక్కం రవి కుమార్, ఆకుదారి మమత, దార పూలమ్మ, చల్లూరి మమత, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బేతోజు వజ్రమణి, కమల, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, బుర్ర సదానందంగౌడ్, సింగనవేణి చిరంజీవి, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి, యూత్ నాయకులు శ్రీరామ్, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో తిరుమలాచారి, నిరంజన్, రమేశ్, తిరుపతి, బ్రహ్మచారి, చంద్రమౌళి, వీరాచారి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
బాఫ్టా రెడ్కార్పెట్.. ప్రియాంకా డ్రెస్సు చూశారా ?
గుడ్న్యూస్.. స్పుత్నిక్ వ్యాక్సిన్కు ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్సిగ్నల్