కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా తేలడంతో అలజడి రేగింది. దీంతో కొలంబో వేదికగా మంగళవారం శ్రీలంకతో జరుగాల్సిన రెండో టీ20 బుధవారానికి వాయిదా పడింది. మ్యాచ్కు కొన్ని గంటల ముం దు కృనాల్ గొంతులో ఇబ్బందిగా అనిపించడంతో అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత భారత బృందం మొత్తానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. కృనాల్కు సమీపంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లకు నెగెటివ్ అని తేలడంతో బుధవారం రెండో టీ20 సజావుగా సాగే అవకాశాలున్నాయి. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల తర్వాత జట్టులో అందరికీ నెగెటివ్ వస్తే బుధవారం రెండో టీ20 తప్పకుండా జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించిన విషయం తెలిసిందే.