హైదరాబాద్ : దక్షిణ మధ్య మహారాష్ర్ట నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ క్రమంలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురియనుంది. ఇవాళ దక్షిణ తెలంగాణలో ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.