చెన్నై: రష్యా వేదికగా వచ్చే నెలలో జరుగనున్న చెస్ ప్రపంచకప్ టోర్నీకి భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి దూరమైంది. కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో పెట్టుకుని టోర్నీలో చాలా మంది పోటీపడే అవకాశం ఉండటంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంపి శుక్రవారం మీడియాకు వివరించింది. తాను ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించానని ఈ సందర్భంగా హంపి పేర్కొంది.