న్యూఢిల్లీ : కరోనా నుంచి కోలుకున్నాక టీకా ఎప్పుడు తీసుకోవాలి? అనే ప్రశ్న అందర్నీ వెంటాడుతోంది. ఈ సందర్భంగా టీకాపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (NTAGI) పలు సూచనలు చేసింది. కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలి అని సూచించింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు.. రెండో డోసు కోసం 4 – 8 వారాల పాటు ఆగాలని చెప్పింది.
గర్భిణీలకు ఏ టీకా అయినా ఇవ్వొచ్చు అని తెలిపింది. ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా వేయించుకోవచ్చు అని సూచించింది. కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలని చెప్పింది. ప్రస్తుతం కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య 6 – 8 వారాల వ్యవధి ఉంది. కొవాగ్జిన్ టీకా మధ్య వ్యవధిని యథావిధిగా ఉంచాలని జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సూచించింది.
ఇవి కూడా చదవండి..