న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు దిలీప్గాంధీ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికంగా ప్రజలకు దూరమైనా సమాజ సేవ, పేదల సంక్షేమానికి చేసిన గొప్ప కృషి ద్వారా ఎప్పటికీ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ బలోపేతానికి దిలీప్గాంధీ ఎనలేని కృషి చేశారని మోదీ కొనియాడారు. దిలీప్గాంధీ కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.