సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ : కరోనా విపత్తును ఎదుర్కొనేలా లాక్డౌన్ను మరోమారు పొడ గించిన నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు, తార్నాక ప్రాంతాల్లో సోమవారం ఆయన వాహనాల తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. సవరించిన నియమాల ప్రకారం అన్ని వాణిజ్య సంస్థలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. ప్రజలందరూ తమ పనులను ముగించుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండ్లకు చేరాలని సూచించారు. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వివరించారు. గూడ్స్ వాహనాలను కేవలం రాత్రి 9 నుంచి ఉదయం 11 గంటల వరకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. డీజీపీ వెంట సీపీ మహేశ్ భగవత్, అదనపు సీపీ సుధీర్బాబు, జాయింట్ కమిషనర్ ఎం.రమేశ్, డీసీపీలు సంప్రీత్సింగ్, శ్రీనివాస్, ఏసీపీ ఆకుల శ్రీనివాస్, సీఐ రమేశ్నాయక్, డీఐ కాంతారెడ్డి ఉన్నారు.