మెల్బోర్న్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్ ప్రశంసలు కురిపించాడు. అసలు, సిసలైన పోటీతత్వంతో ప్రత్యర్థి మెప్పును పొందగలిగే కోహ్లీని కలకాలం గుర్తుంచుకుంటానని పైన్ అన్నాడు. గతంలో విరాట్ లక్ష్యంగా చేసుకుంటూ పదునైన విమర్శలు చేసిన ఈ ఆసీస్ కెప్టెన్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. 2018-19 పర్యటనలో కోహ్లీ..భారత జట్టులో ఒక ఆటగాడు మాత్రమేనని, అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆసీస్ జట్టు ద్వేషించేందుకు మొగ్గుచూపుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం ‘గిల్లీ అండ్ గాస్’ పాడ్కాస్ట్లో పైన్ మాట్లాడుతూ ‘సవాళ్లను స్వీకరించడంలో ముందుండే విరాట్తో పోటి ఎప్పటికైనా మజానే. ప్రతి విషయంలోనూ పైచేయి సాధించాలనే తపనతో కనిపిస్తాడు. అందరికంటే భిన్నమైన కోహ్లీని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని అన్నాడు.