దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్లో మరోసారి ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయిన పంజాబ్ కింగ్స్ టీమ్కు మరో షాక్ తగిలింది. కెప్టెన్గా ఆ టీమ్కు పెద్దగా విజయాలు సాధించిపెట్ట లేకపోయినా.. బ్యాట్స్మన్గా కళ్లు చెదిరే రీతిలో రాణించిన కేఎల్ రాహుల్( KL Rahul ) వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడబోవడం లేదని క్రిక్బజ్ అనే న్యూస్సైట్ వెల్లడించింది. ఈ సీజన్లో 13 మ్యాచ్లలో రాహుల్ 626 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో అతడే టాప్లో ఉన్నాడు.
అయితే ఇక పంజాబ్ టీమ్కు గుడ్బై చెప్పి రానున్న మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్ భావిస్తున్నట్లు ఆ రిపోర్ట్ తెలిపింది. వచ్చే సీజన్ కోసం ఈ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ కేవలం ముగ్గురు ప్లేయర్స్ను రిటేన్ చేసుకొని, మిగతా అందరినీ వదిలేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్లాంటి ప్లేయర్ను రిటేన్ చేసుకోవడానికి పంజాబ్ ఆసక్తిగానే ఉన్నా.. రాహుల్ అందుకు సిద్ధంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే అతన్ని పలు ఇతర ఫ్రాంచైజీలు సంప్రదించినట్లూ సమాచారం. ఒకవేళ రాహుల్ మెగా వేలంలో పాల్గొంటే.. అతనికి భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. 2018 నుంచి పంజాబ్ కింగ్స్కు ఆడుతున్న రాహుల్.. గత నాలుగేళ్లుగా ప్రతి సీజన్లో 600కుపైగా పరుగులు చేయడం విశేషం. అయితే కెప్టెన్గా మాత్రం ఆ టీమ్ను టైటిల్కు చేరువ చేయలేకపోయాడు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న రాహుల్.. టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా బబుల్లో చేరాడు.