ముంబై: స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్( KL Rahul ) ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్( Punjab Kings ) ఫ్రాంఛైజీలో చేరినప్పటి నుంచి మారిపోయాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లీగ్లో పరుగుల వరద పారిస్తున్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన సీజన్లో రాహుల్ 670 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తాజాగా రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగుల మార్క్ చేరుకున్న తొలి భారత బ్యాట్స్మన్గా నిలిచాడు.
రాహుల్ 143 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ను చేరుకోగా..కోహ్లీ 167 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఐపీఎల్లో రాహుల్ 76 ఇన్నింగ్స్ల్లో 2,808 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 91 పరుగులతో విజృంభించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఆల్టైమ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 187 ఇన్నింగ్స్ల్లో 5,949 రన్స్ చేశాడు.