అబుదాబి: ముంబై ఇండియన్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైనందుకు కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తో పాటు ఆ జట్టు సభ్యులకు జరిమానా పడింది. ముంబైపై కోల్కతా ఏడు వికెట్ల తేడాతో గెలిచిన ఈ పోరులో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు మోర్గాన్పై రూ. 24 లక్షలు, జట్టు సభ్యులపై 6 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ముంబై ఇండియన్స్తో జయాద్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు కోల్కతా ఆటగాళ్లకు జరిమానా పడింది. నిబంధనల ప్రకారం కోల్కతాకు ఇది రెండో తప్పిదం కావడంతో కెప్టెన్ మోర్గాన్పై రూ. 24 లక్షలు, తుది జట్టులోని సభ్యులపై రూ. 6 లక్షలు లేదా.. మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువుంటే అది) జరిమానా విధించాం’ అని ఐపీఎల్ శుక్రవారం తెలిపింది.