కోల్కతా: వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు దూరమైన స్టార్ పేసర్ పాట్ కమిన్స్ స్థానంలో.. న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీని ఎంపిక చేసుకుంటున్నట్టు కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ప్రకటించింది. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు ప్రారంభం కానుండగా.. కమిన్స్ గైర్హాజరీలో బౌలింగ్ దళానికి నాయకత్వం వహించగల సీనియర్ కావాలానే సౌథీని ఎంపిక చేసుకున్నట్లు ఫ్రాంచైజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో సౌథీని ఎంపిక చేసుకున్నాం. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న సౌథీ.. బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించగలడు’ అని పేర్కొంది.
పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ మ్యాచ్లాడిన సౌథీ 99 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బెంగళూరు జట్టు ఆడమ్ జంపా, డానియల్ సమ్స్, ఫిన్ అలెన్, కేన్ రిచర్డ్సన్.. స్థానాల్లో వణిండు హసరంగ, దుష్మంత చమీర, జార్జ్ గార్టన్, టిమ్ డావిడ్లను ఎంపిక చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై స్థానాలను న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ గ్లెన్ పిలిప్స్, దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీతో భర్తీ చేసింది. పంజాబ్ జట్టు రిలే మెరెడిత్కు రిప్లేస్మెంట్గా నాథన్ ఎలీస్ను తీసుకున్న విషయం తెలిసిందే.