టీఆర్ఎస్ నేత రాజేశ్వర్
కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కుభీర్, మే 5 : కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్ పేర్కొన్నారు. మండల కేంద్రం కుభీర్లోని ఐకేపీ కార్యాలయంలో బుధవారం 12 గ్రామ పంచాయతీ పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఒక్కొక్కరికీ రూ. 1,00,116వేల చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ వెంకట రమణ, ఎంపీడీవో శేఖర్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పు ప్పాల పీరాజీ, సహకార సం ఘం డైరెక్టర్ దొంతుల లింగన్న, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సర్పంచ్లు ఆకుల గంగాధర్, బాలేరావు శంకర్, జే చంద్రకాంత్, దత్తూగౌడ్ నాయకులు పానాజీ విజయ్కుమార్, పాంగ్ర పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
కల్లూర్లో..
కుంటాల, మే 5 : కల్లూర్ గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి గంగామణి అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీటీసీ మధు పాల్గొన్నారు.
భైంసాలో..
భైంసా, మే 5 : పట్టణంలో 134 షాదీముబారక్ చెక్కులను తహసీల్ కార్యాలయంలో అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రతిరోజూ కొన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నామన్నారు. భైంసా పట్టణానికి చెందిన 134 మందికి షాదీముబారక్ చెక్కులను అందించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ శేఖర్, ఆర్ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.