కొడంగల్, సెప్టెంబర్ 25: హర్యానాలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ టోర్నీలో వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన కిరణ్ అదరగొట్టాడు. పురుషుల 800 మీటర్ల రేసులో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్న కిరణ్.. అదే జోరు కొనసాగిస్తూ స్టిపుల్చేజ్లోనూ స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో రెండు పసిడి పతకాలు సాధించి వచ్చే నెలలో మలేషియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు కిరణ్ అర్హత సాధించాడు. సామాన్య కుటుంబానికి చెందిన కిరణ్.. జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభను కనబర్చడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.