ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ హీరో. అందుకే ఈయనేం చేసినా కూడా అందరి కళ్లు దానిపైనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఈయన ఓ నిర్ణయం తీసుకుంటున్నాడు. దాంతో నిర్మాతలతో పాటు దర్శకులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఆ నిర్ణయం ఇప్పుడు కాదు మరో రెండేళ్ల తర్వాత అప్లై చేయబోతున్నాడు. అన్ని భాషల్లోనూ ప్రభాస్కు ఇప్పుడు మార్కెట్ ఉంది. బాహుబలి సినిమాతో వచ్చిన ఇమేజ్ ఫ్లూక్ కాదు.. తర్వాత సినిమాలకు కూడా ఆ మార్కెట్ ఉందని నిరూపించుకునే పనిలోనే ఇప్పుడు బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఆ క్రమంలోనే బాహుబలి తర్వాత ఈయన చేసిన సాహో సినిమా హిందీలో కూడా 150 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ రేంజ్ చూపించింది. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అయింది. దాంతో ప్రభాస్ కు ధైర్యం వచ్చింది.
ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు కూడా మరింత నమ్మకం పెరిగింది. అందుకే ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాల బడ్జెట్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి. ఒక్కో సినిమాకు వందల కోట్లు పెడుతున్నాడు నిర్మాతలు. ప్రస్తుతం ప్రభాస్ కమిటైన రాబోయే 4 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు దాటిపోయిందంటే ఈయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ బడ్జెట్ దాదాపు 140 కోట్లు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత సలార్ బడ్జెట్ కూడా 140 కోట్లకు పైగానే ఉండబోతుంది. కేజియఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. ప్యాన్ ఇండియన్ స్థాయిలో 150 కోట్లకు తగ్గకుండా ఈ సినిమా రానుంది.
మరోవైపు ఆదిపురుష్ పౌరాణిక చిత్రం. అందులో రాముడిగా నటించబోతున్నాడు ప్రభాస్. ఈ చిత్రం కోసం 300 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా కోసం 400 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు నిర్మాత అశ్వినీదత్ ప్రకటించాడు. ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుందని.. అందుకే అంత బడ్జెట్ అయినా ధైర్యం చేస్తున్నామని చెప్పుకొచ్చాడు ఈ నిర్మాత. అలా మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న రాబోయే 4 సినిమాల బడ్జెట్ దాదాపు 1000 కోట్లు ఉండబోతుంది. ఈ నాలుగు సినిమాలను కూడా నాలుగేళ్లలో పూర్తి చేయాలని చూస్తున్నాడు.
అది కూడా కరోనా వచ్చింది కాబట్టి.. లేదంటే మూడేళ్లలో నాలుగు సినిమాలు విడుదల చేయాలనేది ముందు నుంచి ప్రభాస్ వేసుకున్న ప్లాన్. అంటే ఈ లెక్కన 2024 వరకు కూడా ప్రభాస్ ఎవరికీ దొరకడన్నమాట. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం కమిటైన నాలుగు సినిమాలు పూర్తైన తర్వాత ఈయన ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తున్నాడు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా.. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసినబండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?