యాదాద్రి, జూన్ 6: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ అన్నారు. యాద గిరిగుట్ట పట్టణంలో అనారోగ్య కారణాల తో చికిత్స పొందిన ఆరె లక్ష్మికి రూ. 60, 000, గడ్డమీది రాజాకు రూ. 20,000, పల్లెపాటి పెద్దులుకు రూ.45,000ల సీఎం ఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు కాగా ఆ దివారం ఆమె లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణానికి చెంది న నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉం టామన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీ తా మహేందర్రెడ్డి కృషితో పట్టణ అభివృ ద్ధికి పాటుపడుతామన్నారు. అనంతరం ప ట్టణంలో బూడిద లాస్య, మేకల రాజు వి వాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వధువుకు రూ. 5,000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో టీ ఆర్ఎస్ నాయకులు నర్సింహా, బాలరాజు గౌడ్, లింగం, నరేశ్, చంద్రయ్య, ప్రదీప్, నాగేందర్, కుమార్, హరేందర్, క్రాంతి, కనకరాజు, అంజి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం: మండలంలోని నాగి నేనిపల్లికి చెందిన గుజ్జ నాగమణికి (రూ. 11వేలు), గుజ్జ బాలమల్లేశ్కు (రూ.12 వేలు) మంజూరైన సీఎం సహాయనిధి చె క్కులను ఆదివారం సర్పంచ్ భట్కీర్ బీర ప్ప అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చెక్కుల మంజూరుకు సహకరించిన ప్రభు త్వవిప్ గొంగిడి సునీతారెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప పర్పంచ్ రాంరెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వెంక టేశం, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీశైలం, ఏ క్బాల్, భిక్షపతి, రాములు పాల్గొన్నారు.