న్యూఢిల్లీ : దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’ అవార్డు పేరు మారింది. ఇక నుంచి ఈ అవార్డును ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్త్న్ర’గా మారుస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ట్విట్టర్లో తెలిపారు. భారత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కు నివాళిగా ఈ పురస్కారానికి ఆయన పేరు పెట్టినట్టు మోదీ పేర్కొన్నారు. ఖేల్త్న్ర పేరును మార్చాలని దేశవ్యాప్తంగా వినతులు వచ్చాయని, వాళ్ల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పేరును మారుస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఖేల్త్న్ర పేరు మార్పును స్వాగతించిన కాంగ్రెస్.. గుజరాత్లోని మోదీ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాల పేర్లనూ మార్చాలని డిమాండ్ చేసింది.