హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఖమ్మం జిల్లా ఓవరాల్గా 70 పతకాల (పురుషులు 32, మహిళలు 38)తో అగ్రస్థానం దక్కించుకుంది. 69 పతకాలు కైవసం చేసుకున్న రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత పురుషుల టైటిల్ను రంగారెడ్డి జిల్లాకు చెందిన రిషబ్ మిశ్రా గెలుచుకోగా.. మహిళల టైటిల్ మాయావతి కైవసం చేసుకుంది. విజేతలకు ఆదివారం అథ్లెటిక్స్ జాతీయ కోచ్ నాగపురి రమేశ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బలరాం, రాజేశ్ కుమార్, భాస్కర్ రెడ్డి, చిస్తి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఈ పోటీల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఎమ్ఎల్ఆర్ఐటీ విద్యార్థులను ఆ సంస్థ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు.