న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో నాలుగు దశాబ్దాల తర్వాత ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్పై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. అతనికి తాజాగా వీపీఎస్ హెల్త్కేర్ సీఎండీ డాక్టర్ షంషీర్ వయాలిల్ రూ.కోటి నగదు బహుమతి ప్రకటించారు. టోర్నీ అంతా నిలకడగా రాణించిన శ్రీజేష్.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ చివరి క్షణాల్లోనూ జర్మనీపై పెనాల్టీ కార్నర్ను అడ్డుకొని టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. టీమ్ విజయంలో అతని పాత్రను అభినందిస్తూ.. ఈ నగదు అందిస్తున్నట్లు షంషీర్ వయాలిల్ చెప్పారు. జర్మనీపై 5-4తో గెలిచిన ఇండియా.. ఒలింపిక్స్లో 41 ఏళ్ల తర్వాత మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ శ్రీజేష్ను గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాకు అభిమానులు పిలుచుకుంటున్నారు.