పోర్టొరజ్(స్లోవేనియా): చెక్ టెన్నిస్ క్రీడాకారిణి క్యాటరీనా సినియకోవా పోర్టోజ్ డబ్ల్యూటీఏ టైటిల్ను గెలుచుకుంది. ఆదివారం ఫైనల్లో సినియకోవా 6-7(4/7), 7-6(7/5), 6-4తో ఎలెనా రిబకినాపై గెలిచింది. తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయిన సినియకోవా రెండో సెట్ను టైబ్రేక్తోనే గెలుచుకుంది. నువ్వానేనా అన్నట్టు సాగిన మూడో సెట్లో స్కోరు 4-4తో ఉన్నపుడు సినియకోవా బ్రేక్తో ముందంజ వేసి ట్రోఫీ దక్కించుకుంది.