డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న తాజ్ హోటల్ను మూసివేశారు. మూడు రోజల పాటు హోటల్ను మూసివేస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. అక్కడ ఉన్న 76 మంది కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలడంతో ఆ హోటల్ను మూసివేశారు. కరోనా కేసులు నమోదు కావడంతో.. హోటల్ను శానిటైజ్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా హోటల్ను మూసివేస్తున్నట్లు తెహ్రీ ఘర్వాల్ అధికారి తృప్తి భట్ తెలిపారు.