బర్మింగ్హామ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంగ్లండ్తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో గురువారం నుంచి మొదలయ్యే మ్యాచ్కు విలియమ్సన్ స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత్తో కీలకమైన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్కు ముందు విలియమ్సన్ గాయం తీవ్రత ఎక్కువ కావద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ బుధవారం పేర్కొన్నాడు. ‘కొంత కాలంగా మోచేతి గాయం కేన్ను తీవ్రంగా వేధిస్తున్నది. మార్చి నుంచి అతను జట్టుకు దూరం కావడం ఇది తొలిసారి. టెస్టు మ్యాచ్ నుంచి విలియమ్సన్ తప్పుకోవడం సులువైన నిర్ణయం కాదు. కానీ టీమ్ఇండియాతో కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భారత్తో మ్యాచ్ నాటికి అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకముంది’ అని అన్నాడు.