నారాయణపేట, మార్చి 23 : విప్లవవీరులు భగత్సిం గ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇచ్చిన స్ఫూర్తితో కుల, మత, జా తి విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీనాథ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షు డు సాయికుమార్ పిలుపునిచ్చారు. భగత్సింగ్, రాజ్గు రు, సుఖదేవ్ల వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికంబాన్ని కూడా ఎగతాలి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు, అరుణోద య జిల్లా కోశాధికారి అంజి, పీడీఎస్యూ జిల్లా కోశాధికారి గౌస్, నాయకులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలలో…
భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్రెడ్డి, అధ్యాపకులు, పీడీఎస్యూ నాయకులు, వి ద్యార్థులు పాల్గొన్నారు.
భగత్సింగ్ వర్ధంతి
ధన్వాడ, మార్చి 23 : మండలంలోని పాతపల్లిలో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో నాయకులు భగత్సింగ్ వర్ధంతిని నిర్వహించారు. భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు భగత్సింగ్ సే వలను కొనియాడారు. కార్యక్రమంలో పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు, సర్పంచ్ కృష్ణయ్య, గ్రామస్తులు తదిత రులు పాల్గొన్నారు.
ఆశయాలను నెరవేరుద్దాం..
ఊట్కూర్, మార్చి 23 : భగత్సింగ్ ఆశయాలను నెరవేరుద్దామని సర్పంచ్ సావిత్రమ్మ అన్నా రు. భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలో ని బిజ్వారం, చిన్నపొర్ల గ్రామాల్లో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం లో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అరుణోదయ కళా బృందం సభ్యు లు ఆటపాటలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా నాయకుడు సమద్, సభ్యులు అ నిల్, రాజప్ప, కరుమూర్తి పాల్గొన్నారు.
భగత్సింగ్కు నివాళి
నారాయణపేట రూరల్, మార్చి 23 : దేశం కోసం ప్రా ణత్యాగం చేసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు నరహరి, మోహన్, ఆం జనేయులు, బల్రాం, వెంకట్రామరెడ్డి, రోజ, జ్యోతి, సం గీత, స్వప్న పాల్గొన్నారు.
పీవైఎల్ ఆధ్వర్యంలో …
కృష్ణ, మార్చి 23 : భగత్సింగ్ ఆశయాలను కొనసాగించాలని పీవైఎల్ జిల్లా కార్యదర్శి ఆనంద్ అన్నారు. మండలంలోని ఖాన్దొడ్డిలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా పీవైఎల్ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ విముక్తి కోసం ఉద్యమించిన మహనేతలు అని కొనియాడారు. కార్యక్రమంలో పీవైఎల్ నా యకులు దత్తు, బస్వరాజ్, తాయప్ప, ఆంజనేయులు, హ న్మంతు, అశోక్, మహమ్మద్, వరణప్ప, లక్ష్మణ్ తదితరు లు పాల్గొన్నారు.