పెద్దవూర/ గుర్రంపోడు: ఉప ఎన్నిక వేళ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. గురువారం పెద్దవూర మండలంలోని 12 గ్రామపంచాయతీల నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన 1,250 కుటుంబాలు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధానకార్యదర్శి దేవసాని శ్రీనివాస్రెడ్డి, కత్తి విజయ్రెడ్డి, నడ్డి బాలరాజు యాద వ్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. గుర్రంపోడు మండలం పాల్వాయిలో కాంగ్రెస్ మాజీసర్పంచ్ వెంకటేశ్వర్లు, వార్డు సభ్యురాలు హేమలత, మత్సకారుల సంఘం అధ్యక్షుడు మేకల సూరయ్య, 150 మంది ముదిరాజ్లు మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బండ ప్రకాశ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
అనుముల మండలం నా యుడుపాలెంలో సుమారు వంద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో, నిడమనూరులో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 15 కుటుంబాలు ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, ఎన్ భాస్కర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. త్రిపురారంలో సత్యనారాయణఫురం, నీలాయిగూడెం, అంజనపల్లి, కుంకుడుచెట్టు గ్రామా ల నుంచి బీజేపీ, కాంగ్రెస్కు 350 మంది కార్యకర్తలు, త్రిపురారం మాజీ ఎంపీటీసీ ఎం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది కార్యకర్తలు ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బానోతు శంకర్నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దాంతి కృష్ణ తన అనుచరగణంతో చేరారు.