చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ జానీ బెయిర్స్టో అరుదైన ఘనత సాధించాడు. లీగ్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో బెయిర్స్టో అత్యధిక స్కోర్ 114. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 38 రన్స్ సాధించడం ద్వారా ఈ ఫీట్ అందుకున్నాడు.
ఐపీఎల్లో 26 ఇన్నింగ్స్ల్లోనే వెయ్యి పరుగుల మార్క్ అందుకోవడం విశేషం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ షాన్ మార్ష్ అగ్రస్థానంలో ఉన్నాడు. మార్ష్ కేవలం 21 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. వెస్టిండీస్ బ్యాట్స్మన్ లెండిల్ సిమన్స్(23 ఇన్నింగ్స్ల్లో), ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్(25 ఇన్నింగ్స్ల్లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో సన్రైజర్స్ కేవలం ఒక మ్యాచ్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.