Sports
- Jan 24, 2021 , 21:15:19
VIDEOS
పోరాడిన కెప్టెన్ జో రూట్

గాలె: శ్రీలంకతో రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(186: 309 బంతుల్లో 18ఫోర్లు) అదరగొట్టాడు. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అద్భుత ఆటతీరుతో ఆదుకున్నాడు. ఓవర్నైట్ స్కోరు 98/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మూడో రోజు, ఆదివారం ఆట చివరికి 339/9తో నిలిచింది.
లంక బౌలర్ ఎంబుల్డేనియా(7/132) ధాటికి ఓవైపు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ తడబడుతున్నా రూట్ ఒంటరి పోరాటం చేశాడు. డబుల్ సెంచరీకి చేరువలో రనౌటయ్యాడు. జోస్ బట్లర్(55) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం జాక్ లీచ్(0) క్రీజులో ఉండగా జేమ్స్ ఆండర్సన్ బ్యాటింగ్కు రావాల్సి ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 381 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
MOST READ
TRENDING