వంద మీటర్ల పరుగు పందెం పోటీలలో కొత్త చిరుత దూసుకొచ్చింది. ఈ పోటీలలో జమైకా పరుగుల వీరులు కాకుండా ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ స్వర్ణం సాధించి రికార్డు సృష్టించాడు. గత రెండు దశాబ్దాలుగా ఈ పోటీలలో జమైకన్ ఆటగాళ్లదే ఆధిపత్యం కొనసాగుతుండగా జాకబ్స్ దానికి చెక్ పెట్టాడు. ఆదివారం జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో జాకబ్స్.. 9.80 సెకన్లలోనే పరుగు పూర్తి చేసి స్వర్ణం నెగ్గగా ఫ్రెడ్ కెర్లీ (అమెరికా-9.84 సెకన్లు) రజతం సాధించాడు. కెనడాకు చెందిన ఆండ్రి డి గ్రాస్సే (9.89 సెకన్లు) కాం స్య పతకం నెగ్గాడు. కాగా జమైకన్ స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ (2004-2016) లేకుండా జరుగుతున్న టోక్యోలో వంద మీటర్ల పరుగు పందానికి సంబంధించి ఆ దేశానికి చెందిన ఒక్క ఆటగాడూ ఫైనల్స్కు అర్హత సాధించకపోవడం గమనార్హం. 2000 (సిడ్నీ) ఒలింపిక్స్ తర్వాత జమైకన్ ఆటగాడు లేకుండా ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. యోహాన్ బ్లేక్ కూడా ఈ పోటీల ఫైనల్కు అర్హత సాధించలేదు.