శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అనంత్నాగ్ జిల్లా కోకర్నాగ్ ప్రాంతంలోని వైలూలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో లష్కరే తాయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ముష్కరులు హతమయ్యాడని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి