ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, పుజారా, ఇషాంత్ శర్మ, పుజార,రహానె తదితరులు ఇప్పటికే తొలి డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు.
మంగళవారం టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొవిడ్-19 టీకా వేయించుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను బుమ్రా ట్విటర్లో షేర్ చేశాడు. టీకా వేయించుకున్నాను. ‘దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలని’ ట్వీట్ చేశాడు. కెప్టెన్ కోహ్లీ సోమవారం టీకా తీసుకున్నాడు. ‘వీలైనంత త్వరగా టీకాలు వేసుకోండి. జాగ్రత్తగా ఉండండి’ అని కోహ్లీ సోమవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.