నల్లగొండ: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలకు రామలింగేశ్వర స్వామి ఆలయం పేరుగాంచింది. అమావాస్య రోజున భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఈ నెల 11న అమవాస్య ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనేపథ్యంలో నేటి నుంచి 18వ తేదీ వరకు ఆలయంలో భక్తులకు అనుమతి ఉండదని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి