హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహరావు హాజరుకానున్నారు. టోక్యోకు వెళ్లే భారత ప్రతినిధుల బృందంలో జగన్మోహన్రావు పేరును చేర్చుతూ భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐవోఏ కార్యదర్శి రాజీవ్ మెహతా నుంచి జగన్మోహన్రావు లేఖ అందుకున్నారు. తెలుగు రాష్ర్టాల నుంచి టోక్యో విశ్వక్రీడలకు హాజరవుతున్న తొలి వ్యక్తిగా నిలిచిన జగన్కు ఈ అవకాశం రావడం పట్ల క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగనున్న ఒలింపిక్స్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడం పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు.