జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో కరోనాను నియంత్రించడంపై ఆర్టీసీ అధికారులు కూడా దృష్టి సారించారు. దీని కోసం ప్రతి డిపో పరిధిలోని తిరిగే ప్రతి సిటీ బస్సును వందశాతం శానిటైజ్డ్ చేసిన తరువాతనే రోడ్డుపైకి పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సిటీ బస్సులో గాలి వెలుతురు బాగా వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించేలా డ్రైవర్ల, కండక్టర్లు ప్రయాణికులను చైతన్యం చేస్తున్నారు. కర్ఫ్యూ నేపధ్యంలో ఉదయం 6గంటల నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.