హైదరాబాద్ : కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో మాజీ అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానికి కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. ఇందుకోసం తెలంగాణ నుంచి భారత హ్యాండ్ బాల్ సమైక్య అధ్యక్షులు జగన్ మోహన్ రావు, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఓసీ ప్రతినిధులుగా నియమితులయ్యారు. వైద్య, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్లు ఆన్లైన్లో ఈ లింక్ (www.research.net/r/sai-ioa-covid-19) ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకుంటే తగిన సాయం చేయనున్నట్లు జగన్ మోహన్రావు తెలిపారు.