నిజామాబాద్ రూరల్, మే 10 : నిజామాబాద్ మండలంలోని మల్లారం గ్రామంలో కొనసాగుతున్న జ్వర సర్వేను నిజామాబాద్ ఆర్డీవో రవి సోమవారం పరిశీలించారు. కరోనా లక్షణాలున్న వారిని ఎలా గుర్తిస్తున్నారని సర్వే బృందం వారిని అడిగి తెలుసుకున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామంలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ ప్రశాంత్కుమార్, ఎంపీడీవో మల్లేశ్, ఏపీవో ప ద్మ, సర్పంచ్ నగేశ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు ఉన్నారు.
జ్వర సర్వేకు సహకరించాలి
జ్వర సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎత్తొండ అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి కోరారు. సోమవారం గ్రామంలో సర్వే నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న జ్వర సర్వే
మండలంలోని తగిలేపల్లి, పాత వర్ని, మల్లారం, జాకోర, జలాల్పూర్ తదితర గ్రామాల్లో సోమవారం జ్వర సర్వే కొనసాగింది. సర్వేలో ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తగిలేపల్లిలో నిర్వహిస్తున్న సర్వేను ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. సర్వేలో ఎంపీవో చందర్, సర్పంచులు మైసం వెంకటేశ్వర్లు, పద్మ, నాగభూషణం, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
చందూర్లో..
మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో సోమవారం సర్పంచ్ బి. సత్యనారాయణ ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించారు. జీపీ కార్యదర్శి నరేందర్ , ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
విజయవంతంగా ఇంటింటి సర్వే..
బోధన్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘ఇంటింటి జ్వర సర్వే’ విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం పలు వార్డుల్లో బోధన్ మున్సిపాలిటీ, ఆరోగ్యశా ఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. జ్వరం, దగ్గు తదితర లక్షణాలు ఉన్న వారికి మందులను అందిస్తున్నారు. పట్టణం లోని 26వ వార్డులో కౌన్సిలర్ ఇంటింటి ఆరోగ్య సర్వేలో ప్రతి రోజూ స్వయంగా పాల్గొంటుండడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.
ఎడపల్లిలో..
ఎడపల్లి మండలంలో ప్రభు త్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఇంటింటి సర్వే కొనసాగుతోంది. మండలంలోని గ్రామాల వారీగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, పంచాయతీ సిబ్బందితో కలిసి సర్వేను కొన సాగిస్తున్నారు. ప్రతి ఇంట్లో వివరాలు సేకరించడంతోపాటు స్వల్పంగా జ్వరం, జలుబు ఉన్న వారిని గుర్తించి వారికి ప్రాథ మికంగానే చికిత్స అందించేందుకుగాను మందులు అందజే స్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సర్వేలో రాజమణి, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
బోధన్ మండలంలో..
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగం గా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే బోధన్ మండలంలో ముమ్మరంగా సాగుతున్నది. ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ఎవరైనా కరోనా లక్షణలు కలిగి ఉన్నారా? ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని వివరాలను సేకరిస్తున్నారు.