గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఒకవైపు బంగారం ధర గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పుడు ఆభరణాలు కొన్న వారు కంగారు పడుతుంటే మరో వైపు గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు గత మూడు నెలలుగా అంతకంతకు పెరుగుతున్నాయి. గత ఐదు నెలల్లో బంగారం ధర దాదాపు 18 శాతం మేర తగ్గింది. దీంతో ఆభరణాలు, కాయిన్స్, బిస్కట్ రూపంలో కొన్న వారంతా కంగారు పడుతున్నారు. కానీ ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. డిసెంబర్లో రూ.431 కోట్లు, జనవరిలో రూ.625 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 491 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేశారు. తరుగు రిస్క్ లేని, అధిక ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వడ్డీ రేట్ల వంటి వ్యవస్థాగత రిస్క్ లేని బంగారంలో పెట్టుబడులను ఈటీఎఫ్ రూపంలో కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ తెలిపింది.
మిగతా సాధనాల్లో రిస్క్ అంశాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫొలియోలో బంగారానికి కనీసం 15 నుంచి 20 శాతం మేర కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా, హెడ్జ్ చేయడానికి వీలున్న సాధనంగా భావిస్తున్న సెంట్రల్ బ్యాంకులు కూడా ఈ అతి విలువైన లోహంపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి కూడా. కాగా, బంగారం ధర ఇటీవలి కనీస స్థాయిల నుంచి గతవారం రోజులుగా పెరుగుతూ వస్తున్నది. రూ. 44.300 స్థాయిని దిగకుండా బంగారం ధర పలుకుతుంటే కొనుగోళ్లు ప్రారంభించవచ్చు. బంగారంలో టెక్నికల్గా బుల్లిష్ బ్రేకవుట్ జరిగిన నేపథ్యంలో స్పల్పకాలంలో రూ.47 వేల నుంచి రూ.49 వేల వరకు చేరుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ కూడా చదవండి…
ఉద్యోగులకు లింక్డ్ఇన్ గొప్ప ఆఫర్.. అదేంటంటే..!
నూతన ఆవిష్కరణల కోసం జీఎమ్మార్ ఇన్నోవెక్స్