జహీరాబాద్, మార్చి 27 : జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేందు కు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జాతీయ రహదారుల అధికారులు రాష్ట్ర జాతీ య రహదారుల అధికారులకు ఆదేశాలిచ్చారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడంతో స్పందించిన కేంద్ర రోడ్డు, రవాణాశాఖ అధికారులు, రాష్ట్ర అధికారులకు సర్వే చేసి ప్రతిపాదనలు పంపించాలని కోరింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ర్ట మూడు ప్రభుత్వాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చిందని అధికారులు తెలిపారు. జహీరాబాద్, బీదర్, దెగ్లూర్ 112 కిలోమీటర్ రోడ్డును జాతీయ రహదారిగా నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జహీరాబాద్ నుంచి తెలంగాణ – కర్ణాటక సరిహద్దు వరకు 25 కిలోమీటర్ రోడ్డు ఉంది. జాతీయ రహదారి ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి వివరాలతో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖకు లేఖ రాశారు. జహీరాబాద్-బీదర్ రోడ్డు పై ప్రతి రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ప్యాసింజర్, గూడ్స్, ఇతర వాహనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్తుంటాయి. వందలాది వాహనాలతో ఈ రహదారి రద్దీగా ఉం టుంది. జహీరాబాద్ నుంచి బీదర్ వరకు రోడ్డుపక్కన హో టళ్లు, దాబాలు ఏర్పాటు చేసుకొని ప్రజలు ఉపాధి పొందుతున్నారు. జహీరాబాద్ నిమ్జ్ ఈ రోడ్డు మధ్యలో నుంచి వెళ్తుతుంది. జహీరాబాద్-బీదర్ రోడ్డు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కృషితో జాతీయ రహదారిగా గుర్తించేందుకు సర్వే చేయాలని కేంద్రం కోరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.