ఒసిజెక్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ రాహి సర్ణోబత్ పసిడి పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 39 పాయింట్లతో రాహి టాప్లో నిలువగా.. మథిల్డే లాబోల్ (ఫ్రాన్స్), బసరాస్కినా (రష్యా) వరుసగా రజత కాంస్యాలు గెలుచుకున్నారు. ఈ పోటీలో భారత్కే చెందిన స్టార్ షూటర్ మనూ భాకర్ ఏడోస్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కాగా.. ఇప్పటి వరకు మన షూటర్లు ఒక రజతం, రెండు కాంస్యాలు గెలుచుకున్నారు.