ఎల్లమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం
ఖానాపూర్ టౌన్, మార్చి 30: ఖానాపూర్ పట్టణ శివారులోని శ్రీరేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ఏడో వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారికి బోనాల సమర్పణ వైభవంగా జరిగింది. పట్టణంలోని పుర వీధుల్లో గౌడ కులస్థులు 500 మంది మహిళలు ర్యాలీగా తరలి వెళ్లారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మేళ తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొని వచ్చారు. బోనాల ఊరేగింపులో బైండ్ల కళాకారులు నృత్యా లు చేశారు. అనంతరం అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. ఆలయం ఎదుట పెద్ద పట్నాలు వేసి, పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు. 8రోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం ముగిశాయి. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు వొల్లాల చిన్న నర్సాగౌడ్, కోశాధికారి మహేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల రాజేందర్ గౌడ్, టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, గౌడ సంఘం నాయకులు దుర్గం వెంకాగౌడ్, అమరగోని శంకర్గౌడ్, కాసారపు మల్లేశ్గౌడ్, వడ్ల కొండ రాజేశ్వర్గౌడ్, దుర్గి నారాయణగౌడ్, జగిత్యాల భూమాగౌడ్, సిర్ర మొగిలిగౌడ్, నారాయణగౌడ్, బండిపెల్లి సత్యంగౌడ్, కళాకారుడు శేఖర్ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.