వరంగల్ అర్బన్ :
ఆరేండ్ల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితునికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 4 వ అదనపు జిల్లా జడ్జి బుధవారం తీర్పు ఇచ్చారు.
వరంగల్ లోని లేబర్ కాలనీకి చెందిన ఉప్పుల కుమారస్వామి అనే నిందితుడు.. పక్కింటి పసిపాపపై తేది : 02 -01-2019 రోజున ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు విధించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెరుకు సత్యనారాయణ వాదించారు. అప్పటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేయగా.. కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్ ప్రతాప్ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు.