కుమ్రం ఆసిఫాబాద్ : హరితహారాన్ని విజయవంత చేయాలని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కెరమెరి మండలం సాకడ, మెట్ట పిప్రి, సూర్ద పూర్, ధనోర, గాయాగం, కొఠారి, గ్రామాల్లో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదివాసులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారని, నర్సరీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. ఆ నష్టాన్ని ఇప్పుడు భర్తీచేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచితే భవిష్యత్ తరాలకు ఢోకా ఉండదన్నారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా లాంటి మహామ్మారులు మనల్ని పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రాణవాయువును అందించే చెట్లను కాడుకోవడంతో పాటు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి అని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్మి, కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం