న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ఉపాధ్యక్షుడు జనార్దన్సింగ్ గెహ్లాట్ బుధవారం కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో సతమతమైన గెహ్లాట్ జైపూర్లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన గెహ్లాట్..దేశంలో క్రీడాభివృద్ధికి చాలా దోహదపడ్డారు. క్రీడలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ఆయన తనదైన పాత్ర పోషించారు. గెహ్లాట్ మృతి పట్ల రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, సీఎం అశోక్ గెహ్లాట్, ఐవోఏ చీఫ్ బాత్రా తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.