దుబాయ్: ఐపీఎల్( IPL 2021 )లో మళ్లీ అభిమానులు సందడి చేయనున్నారు. ఈ నెల 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు. అయితే పరిమిత స్థాయిలోనే అనుమతించనున్నట్లు ఐపీఎల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ 2021 గత మార్చిలో ఇండియాలో ప్రారంభమైనా.. కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీ ఆదివారం చెన్నై, ముంబై మ్యాచ్తో మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లు దుబాయ్, షార్జా, అబు దాబిలలో జరగనున్నాయి. గతేడాది కూడా ఐపీఎల్ ఇక్కడే జరిగినా.. అప్పుడు అభిమానులు అనుమతించలేదు. అభిమానులు టికెట్లను ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ www.iplt20.com లో కొనుగోలు చేయవచ్చు. గురువారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.